Pages

Monday, September 12, 2016

మనం మంచి నీళ్ళు ఎప్పుడు , ఎంత , ఎలా , ఏ విధముగా త్రాగాలి ?



 మనం మంచి నీళ్ళు ఎప్పుడు , ఎంత , ఎలా , ఏ విధముగా త్రాగాలి ?

    అన్ని రోగాలకి చికిత్సకంటే , రోగాల బారిన పడకుండా ఉండటమే ఎంతో ప్రధానము అంటారు మహర్షి వాగ్భటాచార్యుడు .

    "భోజనాంతే విషం వారీ" , అంటే భోజనం చివర నీరు త్రాగటం "విషం"తో సమానం . మనం తీసుకున్న ఆహారం మొదట జీర్ణాశయానికి చేరుతుంది . అక్కడ అగ్ని ( జఠరాగ్ని ) ప్రదీప్తమవుతుంది . ఆ అగ్ని తిన్న ఆహారాన్ని పచనం చేస్తుంది . ఇది ప్రధానమైన విషయం .

    భోజనం తిన్న తరువాత నీళ్ళు త్రాగితే జఠరాగ్ని చల్లబడుతుంది . ఇక తిన్న ఆహారము అరగదు . అది కుళ్ళి పోతుంది . కుళ్ళిన ఆహారం నుండి వచ్చిన విషయవాయువులు శరీరమంతటా వ్యాపిస్తాయి . ఆ విషయవాయువుల వలన 103 రోగాలు వస్తాయి . ఆ కుళ్ళిన ఆహారం వల్ల వచ్చేది కొలెస్ట్రాల , ఆహారం సక్రమంగా జీర్ణమైతే చెడు కొలెస్ట్రాల్ అసలు ఉండదు.

నీరు త్రాగే విధానం :--
  నీటిని గుటక గుటకగా త్రాగాలి . ఒక్కొక్క గుటక నోటిలో నింపుకంటూ చప్పరిస్తూ త్రాగాలి . వేడి వేడి పాలు త్రాగే విధంగా నీటిని త్రాగాలి . నీరు ఎపుడు త్రాగినా ఈ విధంగానే త్రాగాలి . ఇది నీరు త్రాగే సరైన విధానం . గటగటా నీరు త్రాగడం సరైన విధానం కాదు.

ఫలితము :---
    నీటిని గుటక గుటక చప్పరిస్తూ త్రాగితే నోటిలోన వున్న లాలాజలంతో నీరు కలిసి పొట్టలోకి చేరుతుంది . పొట్టలో ఆమ్లాలు తయారవుతాయి . లాలాజలం పొట్టలోని ఆమ్లాలతో కలిసి న్యూట్రల్ అవుతుంది . అసలు నోటిలో లాలాజలం తయారయ్యేది పొట్టలోకి వెళ్ళటానికి , లోపలి ఆమ్లాలని శాంతింప చెయ్యటానికి . అపుడు మనం జీవితాంతం ఏ రోగాల బారినపడకుండా ఆరోగ్యంగా జీవించ వచ్చును.

ఎప్పుడు త్రాగాలి : ----
 బ్రేక్ ఫాష్ట్ లేక భోజనమునకు గంట ముందు నీళ్ళు త్రాగాలి .
బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం చేసిన గంట న్నర తరువాత త్రాగాలి . (ఆహారం జఠర స్ధానంలో గంటన్నర వరకు అగ్ని ప్రదీప్తమై ఉంటుంది). అపుడు ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది‌ .

భోజనం మధ్యలో నీరు త్రాగాలనిపిస్తే 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్ఛును . భోజనం ముగించాక గొంతు శుద్ధి కోసము , గొంతు సాఫీగా ఉంచటానికి 2 లేక 3 గుటకల నీరు త్రాగవచ్చును .
# ఉదయం బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం తరువాత పండ్లరసాలు త్రాగవచ్ఛును .
# మధ్యాహ్న భోజనం తరువాత మజ్జిగ త్రాగవచ్చును .
# రాత్రి భోజనాంతరము పాలు త్రాగవచ్చు .

      ఈ క్రమాన్ని ముందు వెనుకలుగా చెయ్యవద్దు . ఎందుకంటే ఆయారసాలను పచనం చేసే ఎంజైమ్స్ ఆ సమయాల్లో మాత్రమే మన శరీరంలో ఉత్పన్నమవుతాయి .

నీరు ఎంత త్రాగాలి : --
    మీరున్న బరువును 10 తోటి భాగించి 2 ను తీసివేస్తే వచ్చినది మీరు త్రాగవలసిన నీటి శాతం చూసుకొని త్రాగండి . ఉదా: మీరు 60 కిలోల బరువు వుంటే 60 ని 10 చే భాగించితే 6 వస్తుంది . దీనిలో నుండి 2 తీసివేస్తే 4 వస్తుంది.  మీరు 24 గంటల్లో 4 లీటర్ల నీరు త్రాగవలెను .

ఎలా త్రాగాలి :--
# ఎల్లప్పుడూ సుఖాసనంలో కూర్చొని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగాలి .
# నిలబడి నీళ్ళు త్రాగరాదు .
# చల్లని నీళ్ళు ( Cool Water)  త్రాగరాదు .
# గోరు వెచ్చని నీళ్ళు త్రాగవలెను .
# ఎండాకాలములో ( మార్చి నుండి జూన్) మట్టికుండలోని నీరు త్రాగవలెను .

*మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు.
* మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగరాదు .
* స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగరాదు.

మూత్ర విసర్జన తర్వాత నీళ్ళు త్రాగిన మూత్ర సంబంధ  వ్యాధులు వస్తాయి .
మల విసర్జన తర్వాత నీళ్ళు త్రాగిన యెడల మలబద్ధకం వస్తుంది .
స్నానం చేసిన వెంటనే నీళ్ళు త్రాగిన యెడల చర్మ వ్యాధులు లేక ఉబ్బసం వంటి జబ్బులు వస్తాయి .
ఎండ నుండి నీడకు వచ్చి వెంటనే నీళ్ళు త్రాగితే సమస్యలు వస్తాయి .
రిఫ్రిజిరేటర్ నీళ్ళు చాలా హానికరము .

    మనకు ఆహారము ఎంత ప్రధానమో , తిన్న ఆహారము సక్రమంగా జీర్ణమటం అంతే ప్రధానము . 

   మనము తిన్న భోజనము జీర్ణము కాని యెడల అది కుళ్ళిపోతుంది . ఆ కుళ్ళిన ఆహారము వలన శరీరంలో విషవాయువులు పుట్టి 103 రోగాలకు కారణం అవుతుంది . మొట్టమొదట గ్యాస్ ట్రబుల్ ,  గొంతులో మంట , గుండెలో మంట , ఎసిడిటీ , హైపవర్ ఎసిడిటీ , అల్సర్ , పెప్టిక్ అల్సర్ మొదలగునవి వస్తాయి . చివరగా క్యాన్సర్. 

      మీరు ఎల్లప్పుడూ నీటిని గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగిన యెడల , మీరు జీవితంలో ఏ రోగాల బారిన బడరు . సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వుంటారు .
  ఈ సృష్టిలో ప్రతి జంతువు నీటిని చప్పరిస్తూ ఒక్కొక్క గుటకగా త్రాగుతుంది.

      శ్రీ రాజీవ్ దీక్షిత్.

No comments:

Post a Comment

.