Pages

Wednesday, August 23, 2017

మొక్కల్లో మెడికల్‌ షాప్‌

మొక్కల్లో మెడికల్‌ షాప్‌

  • మన చుట్టూరానే ఎన్నో ఔషధాలు
  • చిన్న స్థాయి అనారోగ్యం నుంచి దీర్ఘకాలిక వ్యాధులకూ ఉపశమనం
  • దశాబ్ద కాలంగా పెరుగుతున్న వినియోగం
  • వినాయకుడి పూజలో అన్ని ఔషధాలే..!
  • రాష్ట్ర ఔషధ మొక్కల బోర్డు నివేదిక

సాధారణంగా ఏదైనా అనారోగ్యం తలెత్తితే.. ఏ అల్లోపతి వైద్యుడి దగ్గరికో వెళ్లి మందు బిళ్లలు వేసుకుంటాం. చికిత్స తీసుకుంటాం. కానీ మన చుట్టూ ఉన్న మొక్కలు, చెట్లలోనే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చిన్న అనారోగ్యం నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు ఉపశమనం కలిగించే వేలాది రకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. అసలు మన చుట్టూ ఉన్న మొక్కలు, చెట్లలో చాలా వరకు ఏదో ఒకరకమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఇప్పటివరకు దేశంలోని మొత్తం 18 వేల రకాల వృక్షజాతుల్లో ఏడు వేల జాతుల వరకు ఔషధ గుణాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఆయుర్వేద, యునానీ, సిద్ధ, హోమియోపతి తదితర వైద్య విధానాల్లో వాటిని వినియోగిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్‌

ఔషధ’ సంప్రదాయం;-
మన దేశ సంస్కృతిలోనే సంప్రదాయ వైద్య విధానం ఇమిడి ఉంది. అనాది నుంచి ప్రతి మొక్కలోని లక్షణాలను పరిశీలించి.. వాటిల్లోని ఔషధ గుణాలను గుర్తించారు. వైద్యం కోసం వినియోగించారు. కానీ అనంతరం అల్లోపతి వైద్యం బాగా విస్తరించింది. తిరిగి ఇటీవలి కాలంలో ఔషధ మొక్కల వినియోగంపై పరిశోధనలు, వినియోగం పెరుగుతున్నాయి. ముఖ్యంగా పండుగల సమయంలో వినియోగించే మొక్కలు, వాటి ఉత్పత్తుల్లో ఎన్నో ఔషధ లక్షణాలు ఉంటున్నట్లు పరిశోధనల్లో తేలింది.

ముఖ్యంగా వినాయక చవితిలో వినియోగించే మొక్కలు, వాటి ఉత్పత్తులను పరిశీలిస్తే... ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయని గుర్తించారు. భారత ఔషధ మొక్కల మండలి ఈ అంశాలను ధ్రువీకరించింది కూడా. వినాయక చవితిలో ఉపయోగించే 21 రకాల మొక్కలు, వాటి ఆకులు, ఉత్పత్తుల్లో ఉన్న ఔషధ లక్షణాలపై తెలంగాణ ఔషధ మొక్కల మండలి అవగాహన కల్పిస్తోంది. తాజాగా వీటిపై ఒక నివేదికను కూడా రూపొందించింది.

జీవనోపాధి కూడా.

ఔషధ మొక్కలు ఆరోగ్యపరంగా తోడ్పడడమే కాదు.. వాటి పెంపకం ఎంతో మందికి జీవనోపాధి కూడా కల్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఔషధ మొక్కల ఉత్పత్తులు మన దేశంలోనే ఉన్నాయి. దేశంలో 1,178 ఔషధ మొక్కలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిలో దాదాపు 242 రకాల మొక్కల ఉత్పత్తులు ఏటా వందల టన్నుల్లో వినియోగమవుతున్నాయి. ఇక ఏటా 1.95 లక్షల టన్నుల మేర ఔషధ మొక్కల ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వీటి విలువ సుమారు రూ. 5,000 కోట్ల వరకు ఉండడం గమనార్హం.

మన చుట్టూ ఉన్న Ayurveda medicines ఔషధాలివే.;-


  • మాచీ పత్రం (మాచిపత్రి):* దద్దుర్లు, తలనొప్పి, వాత నొప్పులు, కళ్ల సంబంధ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  • బృహతీ పత్రం (వాకుడాకు):* దగ్గు, జలుబు, జ్వరం, అజీర్ణం, మూత్ర వ్యాధులు, నేత్ర వ్యాధులను నయం చేయడానికి, దంత ధావనానికి పనికివస్తుంది.
  • బిల్వ పత్రం (మారేడు):* జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్ర వ్యాధులు, శరీర దుర్గంధం తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  • దూర్వాయుగ్మం (గరిక):* గాయాలు, చర్మ వ్యాధులు, దద్దుర్లు, మూత్రంలో మంట, ముక్కు సంబంధ వ్యాధులు, ఉదర సంబంధ వ్యాధులు, అర్శమొలల నివారణకు వినియోగిస్తారు.
  • దత్తూర పత్రం (ఉమ్మెత్త):* సెగ గడ్డలు, స్తన వాపు, చర్మ వ్యాధులు, పేను కొరుకుడు, శరీర నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు, రుతు సంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది. ఇది విషపూరితం కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది.
  • బదరీ పత్రం (రేగు):* జీర్ణకోశ వ్యాధులు, రక్త సంబంధ వ్యాధులు, చిన్న పిల్లల వ్యాధుల నివారణకు, రోగ నిరోధక శక్తి పెంపుదలకు తోడ్పడుతుంది.
  • అపామార్గ పత్రం (ఉత్తరేణి):* దంత ధావనానికి, పిప్పి పన్ను, చెవిపోటు, రక్తం కారటం, అర్శమొలలు, ఆణెలు, గడ్డలు, అతి ఆకలి, జ్వరం, మూత్ర పిండాల్లో రాళ్లు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  • తులసీ పత్రం (తులసి):* దగ్గు, జలుబు, జ్వరం, చెవిపోటు, పన్నునొప్పి, తుమ్ములు, చుండ్రు, అతిసారం, గాయాలు తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ముఖ సౌందర్యం, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది.
  • చూత పత్రం (మామిడాకు):* రక్త విరేచనాలు, చర్మ వ్యాధులు, ఇంట్లో క్రిమికీటకాల నివారణకు పనికివస్తుంది.
  • కరవీర పత్రం (గన్నేరు):* కణతులు, తేలుకాటు, ఇతర విష కీటకాల కాట్లు, దురద, కళ్ల సంబంధ వ్యాధులు, చర్మ సంబంధ వ్యాధుల వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  • విష్ణుకాంత పత్రం (విష్ణుకాంత):* జ్వరం, కఫం, పడిశం, దగ్గు, ఉబ్బసం తగ్గించడానికి, జ్ఞాపకశక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది.
  • దాడిమీ పత్రం (దానిమ్మ):* విరేచనాలు, అతిసారం, దగ్గు, కామెర్లు, అర్శమొలలు, ముక్కు నుంచి రక్తం కారడం, కళ్ల కలక, గొంతునొప్పి, చర్మవ్యాధులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  • దేవదారు పత్రం (దేవదారు):* అజీర్తి, పొట్ట సంబంధ వ్యాధులు, చర్మ వ్యాధులు, కంటి సంబంధ వ్యాధులు తగ్గించడానికి వినియోగిస్తారు.
  • మరువక పత్రం (మరువం):* జీర్ణశక్తి, ఆకలి పెంపొందించేందుకు, జుట్టు రాలడాన్ని, చర్మవ్యాధులను తగ్గించేందుకు పనికి వస్తుంది. దీనిని సువాసన కోసం కూడా ఉపయోగిస్తారు.
  • సింధువార పత్రం (వావిలి):* జ్వరం, తలనొప్పి, కీళ్లనొప్పులు, గాయాలు, చెవిపోటు, చర్మ వ్యాధులు, మూర్చ వ్యాధి, ప్రసవం తరువాత వచ్చే ఇబ్బందులను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
  • జాజి పత్రం (జాజి ఆకు):* వాత నొప్పులు, జీర్ణాశయం వ్యాధులు, పెద్దపేగు వ్యాధులు, నోటిపూత, దుర్వాసన, కామెర్లు, చర్మవ్యాధులు తగ్గించడానికి తోడ్పడుతుంది.
  • గండకీ పత్రం (దేవకాంచనం):* మూర్ఛ వ్యాధి, కఫం, పొట్ట సంబంధ వ్యాధులు, నులి పురుగుల నివారణకు పనికివస్తుంది. ఈ ఆకులను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు.
  • శమీ పత్రం (జమ్మి):* కఫం, మూల వ్యాధి, కుష్టు వ్యాధి, అతిసారం, దంత వ్యాధుల నివారణకు వినియోగిస్తారు.
  • అశ్వత్థ పత్రం (రావి ఆకు):* మలబద్ధకం, కామెర్లు, వాంతులు, మూత్ర వ్యాధులు, జ్వరాలు, నోటిపూత, చర్మవ్యాధుల నివారణకు... జీర్ణశక్తి, జ్ఞాపక శక్తి పెంపొందించడానికి తోడ్పడుతుంది.
  • అర్జున పత్రం (తెల్లమద్ది):* చర్మ వ్యాధులు, కీళ్ల నొప్పులు, జీర్ణాశయ, పెద్దపేగు సమస్యలు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది.
  • అర్క పత్రం (జిల్లేడు):* చర్మ వ్యాధులు, సెగ గడ్డలు, కీళ్ల నొప్పులు, చెవిపోటు, కోరింత దగ్గు, దంతశూల, విరేచనాలు, తిమ్మిర్లు, బోదకాలు వంటివాటిని తగ్గించడానికి తోడ్పడుతుంది. (తెలంగాణ ఔషధ మొక్కల మండలి వివరాల ప్రకారం..)

మన సంస్కృతిలోనే వైద్యం

‘‘భారతదేశ సంస్కృతిలోనే సంప్రదాయ వైద్యం ఇమిడి ఉంది. మన పరిసరాల్లోనే మనకు ఎన్నో ఔషధాలు ఉన్నాయి. ఎలాంటి ఖర్చు లేకుండా ఔషధాలను పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా వినాయక చవితి పూజల సందర్భంగా ఉపయోగించే మొక్కలు, ఆకులు, ఉత్పత్తులలో.. వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులను నివారించే ఎన్నో ఔషధాలు ఉండడం గమనార్హం.’’
– ఎ.వెంకటేశ్వర్లు, డిప్యూటీ డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర ఔషధ మొక్కల మండలి.

ఫోన్ పోగుట్టు కుంటే?

ఫోన్ పోగుట్టు కుంటే?

సోమాజిగూడ/హైదరాబాద్: క్రాంతి ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి పంజాగుట్టలో గది అద్దెకు తీసుకొని నివసిస్తున్నాడు. డోర్‌ పక్కన మొబైల్‌ ఫోన్‌ చార్జింగ్‌ పెట్టి స్నానానికి వెళ్లాడు. ఆఫీసుకు వెళ్లేందుకు బ్యాగ్‌, టిఫిన్‌ బాక్స్‌ సిద్ధం చేసుకున్నాడు. ఫోన్‌ తీసుకుందామని డోర్‌ వద్దకు వెళ్లి చూడగా లేదు. రూమ్‌లో ఉన్న మరో స్నేహితుడిని.. నా ఫోన్‌ ఎక్కడుందని అడగగా తెలయదని సమాధానం చెప్పాడు. ఓ క్షణం ఆలోచించాడు... తన వద్ద ఉన్న ల్యాప్‌టాప్‌ ఓపెన్‌ చేసి ఇంటర్నెట్‌ సహాయంతో మొబైల్‌ తన పక్కనే ఉన్న రూమ్‌లో ఉందని గుర్తించాడు. ఇవ్వమని వారిని బతిమాలాడు. నీ ఫోన్‌ మేమెందుకు తీసుకుంటామని వాగ్వివాదానికి దిగారు. క్రాంతి పంజాగుట్ట పోలీ్‌సస్టేషన్‌కెళ్లి విషయాన్ని పోలీసులకు వివరించాడు. కానిస్టేబుల్స్‌ వెళ్లి ఆ గదిని పరిశీలించగా.. మొబైల్‌ ఆచూకీ లభించింది.

      సోమాజిగూడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సింధు స్మార్ట్‌ఫోన్‌ను ఆమె మూడేళ్ల కుమార్తె తీసుకుంది. ఇంట్లో తిరుగుతూ ఫోన్‌తో ఆడుకుంటుంది. గమనించిన ఆమె ఎక్కడికి వెళ్తుందిలే అనుకుంది. కొద్దిసేపటి తర్వాత చిన్నారి చేతిలో నుంచి ఫోన్‌ మాయమైంది. సింధు అర్జెంటుగా ఆఫీసుకు వెళ్లాల్సి ఉంది. ఇంటి నుంచి వెళ్లాలంటే రెండు బస్సులు మారాలి. ఫోన్‌ లేకపోతే కార్యాలయానికి వెళ్లలేని పరిస్థితి. ఇంట్లో ఎంత వెతికినా కనిపించలేదు. కూతురిని అడిగితే చెప్పలేకపోతోంది. గంట సమయం దాటిపోయింది. ఫోన్‌ దొరకడం లేదు. మరో మొబైల్‌ నుంచి ఫోన్‌ చేస్తే రింగ్‌ అవుతున్నా.. ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఫ్రెండ్‌ సహాయంతో ఇంటర్నెట్‌ ఓపెన్‌ చేసి తన జీమెయిల్‌ ఐడీ ద్వారా మొబైల్‌ ఎక్కడుందో క్షణాల్లో తెలుసుకుంది.

     ఎక్కడో ఫోన్‌ పెట్టి మరిచిపోతాం.. పని చేసుకుంటూ ఎక్కడ పెట్టామో తెలియక వెతుకుతుంటాం. పిల్లలు పోన్‌ తీసుకుని గేమ్‌ ఆడుకుని అయిపోయాక ఎక్కడో పెట్టి మరిచిపోతారు. ఫోన్‌ ఎక్కడుందని అడిగితే సమాధానం రాదు. దానికోసం వెతుకుతూ కుటుంబ సభ్యులతో ఘర్షణకు దిగుతాం. ఆలోచిస్తే వెతికి పట్టుకోవచ్చు. ఇంటర్నెట్‌ సహాయంతో మొబైల్‌ ఉన్న ప్రాంతాన్ని తెలుసుకోవచ్చు. ఈమెయిల్‌ ఐడీతో కనిపించని మొబైల్‌ ఫోన్‌ను గుర్తించొచ్చు. ఎవరైనా దొంగలిస్తే లొకేషన్‌ కూడా పట్టేస్తుంది.
ఇలా గుర్తించవచ్చు

         ఆండ్రాయిడ్‌ ఫోన్‌కు జీమెయిల్‌ ఐడీ తప్పనిసరిగా అనుసంధానం చేసి ఉండాలి. కంప్యూటర్‌ లేదా మొబైల్‌లో జీమెయిల్‌ ఐడీని ఓపెన్‌ చేయాలి. మెయిల్‌ ఐడీ పేజీలో కుడివైపు మై అకౌంట్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేయాలి. వెంటనే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో ఫైండ్‌ యువర్‌ ఫోన్‌ అని ఉంటుంది. అక్కడ క్లిక్‌ చేయగానే మరో పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ మన జీ మేయిల్‌ ఐడీ ఏ ఏ మొబైల్స్‌కి అనుసంధానం చేశామే చూపిస్తుంది. అక్కడ మనం ఉపయోగిస్తున్న మొబైల్‌ను సెలెక్ట్‌ చేయాలి. అకౌంట్‌ వెరిఫై చేయాలని పాస్‌వర్డ్‌ అడుగుతుంది. ఐడీ పాస్‌వర్డ్‌ టైప్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. రింగ్‌, లొకేట్‌ యువర్‌ ఫోన్‌ అని ప్రత్యక్షం అవుతుంది. కుడివైపు రెండు సింబల్స్‌ కనిపిస్తాయి. ఒకటి రింగ్‌, రెండోది మ్యాప్‌ లొకేషన్‌. ఇంట్లోనే ఉంటే రింగ్‌ అప్షన్‌ ఉపయోగించి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోన్‌ సైలెంట్‌ మోడ్‌లో ఉన్న రింగ్‌టోన్‌ సౌండ్‌ వినిపిస్తుంది. ఎడమ భాగంలో మరిన్ని ఆప్షన్స్‌ ఉన్నాయి. మొబైల్‌ లొకేషన్‌, డివైజ్‌ లాక్‌, కన్సిడర్‌ ఎరైజ్‌ డాటా... అని ఉన్నాయి. మీకు కావాల్సిన ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి.

వ్యక్తిగత డేటా తొలగించొచ్చు
మహానగరంలో ఎక్కువమంది ఉపయోగించేది ఖరీదైన ఫోన్లే. రోజుకు సుమారు వందకు పైగా వారివారి ఫోన్‌లను పోగొట్టుకుంటున్నట్లు సమాచారం. కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మరి కొంతమంది పోనీలే అని లైట్‌గా తీసుకుంటున్నారు. యువతులు వారికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం ఉంటే దొరికిన వ్యక్తి సామాజిక మద్యమాల్లో పోస్ట్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యమైన ఫొటోలు, ఫోన్‌ నెంబర్‌లు ఉంటాయని ఎవరైనా ఏమైనా చేస్తారేమోనని మనోవేదన చెందుతారు. వీటికి పరిష్కారం ఉందని చాలా మందికి తెలియదనే చెప్పాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని స్మార్ట్‌ ఫోన్‌ను లాక్‌ చేయడంతో పాటు కీలక సమాచారాన్ని తొలగించే అవకాశం ఉంది.

లొకేషన్‌ తెలుసుకోవచ్చు
స్మార్ట్‌ ఫోన్‌కు అనుసంధానం చేసిన జీ మెయిల్‌ ఐడీ సహాయంతో మీ ఫోన్‌ లొకేషన్‌ ఎక్కడుందో తెలుసుకునే వెసులుబాటు కూడా ఉంది. జీ మెయిల్‌ ఐడీ ఓపెన్‌ చేసిన తర్వాత మై అకౌంట్‌ అనే ఆప్షన్‌ ద్వారా మొబైల్‌ లోకేషన్‌ను తెలుసుకోవచ్చు. దీని కోసం పోలీస్‌స్టేషన్‌, ఇతరులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు.

జాగ్రత్తగా వ్యవహరించాలి
ఏ పని చేయాలన్నా అందరూ స్మార్ట్‌ ఫోన్‌ మీద ఆధారపడుతున్నారు. సమాచారాన్నంతటినీ ఫోన్‌లోనే భద్రపరుస్తున్నారు. భద్రతపరంగా భాగానే ఉంటుంది. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాల.....

Wednesday, August 16, 2017

Anganwadi teacher Jobs in Mahabubnagar

Anganwadi teacher Jobs in Mahabubnagar

తెలంగాణా ప్రభుత్వం Anganwadi teacher Jobs in Mahabubnagar
జిల్లా సంక్షెమ అధికారి మహిళా శిశు వికలాంగుల & వయోవృద్దుల శాఖా
మహబూబ్ నగర్ జిల్లా.

నోటిఫికేషన్ నెo. 460/A/2017. తేది:10/08/2017.

మహబూబ్నగర్ జిల్లా లోని (6) ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్ట్ కార్యాలయ పరిధిలోని ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్లు, ఆయాలు మరియు మినీ అంగన్వాడి టీచర్ల పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులు కోరబడుచున్నవి.

ఖాళీల వివరాలు:-
1. మహబూబ్ నగర్ (అర్బన్) = టీచర్లు-06, ఆయాలు-13, మినీ అంగన్వాడి టీచర్-07
2. మహబూబ్ నగర్ (రూరల్) = టీచర్లు-13, ఆయాలు-34,  మినీ అంగన్వాడి టీచర్-08
3. దేవరకద్ర =  టీచర్లు-11,     ఆయాలు-43,    మినీ అంగన్వాడి టీచర్-05
4. మద్దూర్ =  టీచర్లు-03,   ఆయాలు-18,    మినీ అంగన్వాడి టీచర్-01
5. మక్తల్ =   టీచర్లు-19,   ఆయాలు-34,    మినీ అంగన్వాడి టీచర్-02
6. నారాయణపేట =  టీచర్లు-11,   ఆయాలు-41,    మినీ అంగన్వాడి టీచర్-07

దరఖాస్తు తో పాటు తగిన దృవీకరణ పత్రాలు గజిటెడ్ అధికారి అటెస్ట్ తో పాటు 24-08-2017 సాయంత్రం 5 గంటల లోపుఈ క్రింది ఆన్ లైన్ లింక్ ద్వార సమర్పించాలి.

పూర్తి వివరాలకొరకు;- 
http://wdcw.tg.nic.in
OR
http://mahabubnagar.nic.in/
వెబ్ సైట్ ను సందర్శించాలి.



అర్హతలు:-
అభ్యర్థిని తప్పని సరిగా 10 వ తరగతి ఉత్తీర్ణురాలయి ఉండాలి.
జనరల్ కేటగిరి లో దరఖాస్తు చేసుకొనే అభ్యర్తినులు నోటిఫికేషన్ విడుదల ఐన నాటికీ 21 సంవత్సరాలు వయస్సు నిండి,  35-సంవత్సరాల వయస్సు మించకుండా ఉండాలి.
అభ్యర్థిని తప్పనిసరిగా వివాహితురలయి ఉండాలి.
అభ్యర్థిని తప్పనిసరిగా స్తానికంగా ఆ గ్రామంలో / గ్రామపంచాయతి లో నివసిస్తూ ఉండాలి.
ఎస్.సి. ఎస్.టి. కి కేటాఇంచిన అంగన్వాడి కేంద్రాలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు 18-35 సంవత్సరాలు నిండిన వారు కూడా అర్హులు.
ఎస్.సి. కి కేటాఇంచిన అంగన్వాడి కేంద్రాలకు అదే గ్రామా పంచాయతి కి చెందిన అభ్యర్థులు అర్హులు.
ఎస్.టి. కి కేటాఇంచబడిన అంగన్ వాడి కేంద్రాలకు అదే హ్యబిటేషన్ కు చెందిన అభ్యర్థులు అర్హులు.


ఈ క్రింద తెలుపబడిన వికలాంగులైన అభ్యర్తినులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు :-
వినికిడి పరికరాన్ని ఉపయోగించిన వినగలిన వారు.
అంధత్వం ఉన్నప్పట్టికీ (escort) ఇతరుల సహాయం లేకుండా విధులు నిర్వర్తించు కోగలిగిన వారు.
కాళ్ళు, చేతుల కు సంభందించిన అంగ వైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాధమిక విద్యను నేర్చుటకు గాని, పిల్లల సంరక్షణ గాని ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగిన వారు.

జతపరచవలసిన ధ్రువ పత్రాలు:-
(Scanned Copies)
పుట్టిన తేది / వయస్సు ద్రువికరణ పత్రం.
కుల ద్రువికరణ పత్రం.
విద్యార్హతల ద్రువికరణ పత్రం./ పదవ తరగతి మార్కుల జాబితా.
నివాస స్తల ద్రువికరణ పత్రం.
అంగ వైకల్యo కలిగిన వారు వైద్యాదికారి ద్వార ద్రువికరణ పత్రం.
వితంతువు ఐతే భర్త మరణ ద్రువికరణ పత్రం.
అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.
వికలాంగు లైనచో సంభందిత సర్టిఫికేట్.

దరఖాస్తు తో పాటు తగు ద్రువికరణ పత్రాలు గజెటెడ్ అధికారి తో అటెస్ట్ తో తేది:- 24-08-2017 సాయంత్రం 5.00 గంటల లోపు ఈ క్రింద తెలిపిన ఆన్ లైన్ లింక్ ద్వార సమర్పించాలి.

 ఈ నోటిఫికేషన్ పూర్తి రద్దు పరుచుటకు గాని, మార్పులు చేయుటకు జిల్లా కలెక్టర్ గారికి అధికారాలు కలవు.

All Details/Authentic Information visit;-
http://wdcw.tg.nic.in
OR
http://mahabubnagar.nic.in/

Anganwadi teacher Jobs in Mahabubnagar - Anganwadi jobs in Mahabubnagar - Mahabubnagar.nic.in  - wdcw.tg.nic.in - Mahabubnagar anganwadi jobs - anganwadi posts in mahabubnagar dist.- anganwadi vacancies in Koilkonda - deverkhadra - narayanpet - 

Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

Sunday, August 13, 2017

జొరాస్ట్రియన్ మతము (Zoroastrianism)

జొరాస్ట్రియన్ మతము (Zoroastrianism)

జొరాస్ట్రియన్ మతము (Zoroastrianism) ఈ మతముము "మజ్దాఇజం" అనికూడా అంటారు. జొరాస్త్ర మతము (Zoroastrianism) అనేది ఇరాన్(పూర్వపు పర్షియా) దేశానికి చెందిన ఒక మతము. దీనిని జొరాస్టర్ (జరాతుష్ట్ర, జర్-తోష్త్) స్థాపించారు. ఈమతములో దేవుని పేరు అహూరా మజ్దా. ఈ మతస్థుల పవిత్రగ్రంధం, "జెండ్-అవెస్తా" లేదా "అవెస్తా". ఈ మతము ప్రాచీన పర్షియాలో పుట్టినా ఈ మతస్థులు ఎక్కువగా భారతదేశంలో నివసిస్తున్నారు. అందులోనూ ముంబాయిలో ఎక్కువగా నివసిస్తున్నారు.

జొరాస్త్ర మతమును అనుసరించే వారిని జొరాస్త్రీయన్లు అని అందురు. ఈ మతము క్రైస్తవ మతములకంటే పూర్వం ఆవిర్భవించింది. జొరాస్త్రీయన్ల మత గ్రంథమైన అవెస్త (Avesta) లో దేవుడి పేరు ఆహూరా మజ్దా (Ahura Mazda).

జొరాస్త్ర మతము క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సంపూర్ణ మతంగా రూపాంతరం చెందడానికి ముఖ్య కారణం జొరాస్తర్ (Zoroaster) అను ప్రవక్త. ఆర్యుల తెగలకు చెందిన ఈ ప్రవక్త జీవించిన కాలము తెలియరాకున్నది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఇతడు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల నుండి క్రీస్తుపూర్వం 500 వ సంవత్సరాల మధ్య జీవించాడని తెలుపుచున్నవి .

ఆర్యుల సమాజంలో బహు విగ్రాహాల ఆరాధన, జంతు బలులు ఉండేవి. యుక్త వయసులో ఉన్న జొరాస్తర్ (జరాతుస్త్ర) కు స్వప్నంలో సృష్టి కర్త అయిన అహురా మాజ్డ పంపిన ఓహు మనా (Vohu Manah) అను దేవ దూత దర్శనమిచ్చి దైవ ప్రకటకన చెప్పగా దేవుడుఒక్కడే అని నమ్మిన జొరాస్తర్ ఆయ పెద్దలకు వ్యతిరేకంగా ప్రచారం చేయసాగాడు. పూజారులు నమ్మే దేవతలను దేవుళ్ళను దెయ్యాలుగా వర్ణించసాగాడు. దెయ్యాల మతాన్ని వీడమని వారితో చెప్పేవాడు. ఆగ్రహించిన పెద్దలు జొరాస్తర్ ను అంతంచేయాలనుకొని పలుమార్లు విఫలమయ్యారు. జొరాస్తర్ తన బోధనలతో బాక్ట్రియా (Bactria) సామ్రాజ్యపు రాజైన విష్తాస్ప (Vishtaspa) ను ప్రభావితం చేయగలిగాడు. జొరాస్తర్ ముగ్గురు స్త్రీలను వివాహం చేసుకొని ఆరుగురు పిల్లలకు తండ్రి అయ్యాడు. శతాబ్దాల తరువాత బాక్ట్రియాలో ఉన్న ప్రజలు జొరాస్త్రమతాన్ని స్వీకరించారు. చివరికి ట్యురాన్ (Turan) సామ్రాజ్యానికి, పర్షియాసామ్రాజ్యానికి జరిగిన యుద్ధంలో ట్యురాన్ దేశపు రాజుచేతిలో జొరాస్తర్ మరణించాడు. మరణానికి ముందే జొరాస్తర్ తన వంశంనుండి ముగ్గురు రక్షకులుకన్యకలకు జన్మిస్తారని ప్రవచించాడు.

జొరాస్తర్ జీవించిన కాలంలో ఆకాశం, రాళ్ళు, భూమి, నక్షత్రాలు, గ్రహాలు, నదులు, సముద్రాల ఘోష, మరణం, అగ్ని, సమాధులు - ఇవన్నీ విగ్రహాల రూపాలు దాల్చాయి. కాలక్రమేణా ఇండో-ఆర్యన్ తెగల్లో చీలికలు వచ్చాయి. దానితో వారు ఒకే దేవుడిని ఆరాధించే వారిగా (Monotheists) మరియు అనేక దేవుళ్ళను ఆరాధించేవారిగా (Polytheists) చీలిపోయారు. ఫలితంగా అనేక దేవుళ్ళను ఆరాధించే శాఖ వారు పాకిస్తాన్, హిమాలయాల గూండా భారత దేశానికి చేరుకొని నాలుగు వేదాలు (ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం) వ్రాసుకోగా, ఒకే దేవుడిని ఆరాధించే శాఖ వారు మాత్రం అక్కడే స్థిరపడి ప్రవక్త జొరాష్టర్ చెప్పిన సిద్దాంతాలు ఆచరించారు.

జొరాస్త్రీయన్లు చదివే అవెస్త గ్రంథమునకు, భారతీయ వేదాలకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అవెస్త గ్రంథము - యశ్న (worship), గాత (Psalms), వెందిదాద్ (law against demons), యస్త (worship hymns), కోర్ద అవెస్త (litanies and prayers) అను ఐదు భాగాలుగా విభజించబడింది. ఈ గ్రంథము గ్రీకువీరుడైన అలగ్జాండర్, అరబ్బులు వంటి శత్రుదేశ రాజుల ఆక్రమణలవల్ల అవెస్త చాలా వరకూ నాశనమైయ్యింది . నేడు గ్రంథములో కొంత భాగం మాత్రమే మిగిలియున్నది.[4] కన్నడ భాష తెలుగు భాషకు దగ్గరగా ఉన్నట్టు అవెస్తలో ఉపయోగించిన భాష కూడా సంస్కృత భాషకు చాలా దగ్గరగా ఉంటుంది.

జొరాస్త్రీయన్లు అగ్నిని అహురా మజ్దా దేవుడి చిహ్నంగా భావిస్తారు. గుంపుగా ఒకచోట చేరి అగ్నికి ఎదురుగా కూర్చుని అవెస్తాలోని మంత్రాలు చదువుతూ యజ్ఞాలు నిర్వహిస్తారు. జొరాస్త్ర మతము ఏర్పడిన క్రొత్తలో జోరాస్త్రీయన్లకు ఎటువంటి దేవాలయాలు ఉండేవి కాదు. గ్రీకు చరిత్రకారుడైన హెరోడొటస్ (Herodotus) జీవించిన కాలం తర్వాత జొరాష్ట్రియన్లు అగ్ని ఎక్కువసేపు మండే విధంగా కట్టడాలు నిర్మించుకొన్నారు. అవే అగ్ని దేవాలయాలు (Fire Temples). నేడు అగ్ని దేవాలయాలు టర్కీ, ఇరాన్, భారత దేశం లోను మిగిలియున్నాయి.

జొరాస్త్రీరియన్ల నమ్మకం ప్రకారం సృష్టి కర్త అహుర మాజ్డా. ఇతడు సత్యము, వెలుగు, పరిశుద్ధత, క్రమము, న్యాయము, బలము, ఓర్పుకు గుర్తు.ఈ ప్రపంచం మంచికి చెడుకి మధ్య యున్న యుద్ధ భూమి. అందువల్ల ప్రతి మనుష్యుడు దుష్టత్వం నుండి దూరంగా ఉండుట ద్వారా తన ఉనికిని కాపాడుకొని, మత ఆచారాల ద్వారా పరిశుద్ధపరచుకోవాలి.జొరాస్త్రీరియన్ల నమ్మకం ప్రకారం దేవుడు తన నుండి దృశ్యమైన ప్రపంచాన్ని మరియు అదృశ్యమైన ప్రపంచాన్ని సృష్టించాడు. కనుక సృష్టిని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి మానవుడి బాధ్యత.దేవుడు ఆత్మ స్వారూప్యాలను మొదటగా సృష్టించాడు. అగ్ని, నీరు, గాలి, మట్టి, మొక్కలు, జంతువులు, మనుష్యులు కలిగియున్న ప్రపంచము దేవుని శరీరమువలే యున్నది. అయితే ఆయన ఆత్మఎల్లప్పుడూ సృష్టిని సంరక్షించుకొనుచున్నది. ఆది మానవుడినుండి సంరక్షణా దూతలను, మష్యె (Mashye), మష్యానె ( Mashyane) అను మొదటి స్త్రీ పురుషులను సృష్టించాడు దేవుడు. ఈ స్త్రీ పురుషుల నుండియే సమస్త మానవ జాతి ఆవిర్భవించింది.దేవుని సులక్షణాలను ప్రతిబంబించే మరియు భౌతిక ప్రపంచంలో దుష్టుడితో పోరాడటంలో దేవునికి సాయపడే దైవ స్వరూపాలు ఉంటాయి. వీటిలో గొప్పవైన ఆరు అమరమైన స్వరూపాలు లేక అమేష స్పెంతాస్. ఇంకా దేవ దూతలు వగైరా ఉంటాయి. దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి అర్పణలతో కూడిన యజ్ఞాలు, ప్రార్థనలు చేస్తారు.మనిషి సహజంగా దైవ స్వరూపం కలిగి దైవ లక్షణాలు కలిగియుంటాడు. మనుష్యులకు రెండు అవకాశాలుంటాయి - ఒకటి నీతిగా ఉండి దేవుడి బోధనలు పాటించడం, రెండవది దుష్టత్వాన్ని పాటించి నాశనమవ్వడం. మనిషి ఎంచుకొన్న మార్గాన్ని బట్టి దేవుడు ఆ మనుష్యుని ఖర్మను నిర్ణయిస్తాడు. పాప ప్రాయిశ్చిత్తం చేసుకొనే విధానం గురించి, సత్ప్రవర్తన గురించి దేవుడు విజ్ఞానాన్ని ఇస్తాడు. కాని తనను ఆరాధించేవారు చేసిన పాపాలను మోయడు.దేవుడు భౌతిక ప్రపంచం సృష్టించక ముందే ఆత్మీయ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆత్మీయ ప్రపంచం దుష్టశక్తికి అతీతమైనది. భౌతిక ప్రపంచం ఎప్పుడూ దుష్టుడి ఆక్రమణకి గురవ్వుతూవుంటుంది ఎందుకనగా దుష్టుడు అక్కడ నివాసమేర్పరచుకొన్నాడు. కనుక మనుష్యులు తమకు ఎదురయ్యే ప్రమాదాలను గుర్తించాలి. వాటివైపు వెళ్ళకూడదు. అగ్ని, నీరు, భూమి, గాలి - వీటిని దుష్ట స్వరూపాలు లోపలికి వెళ్ళి కాలుష్యం చేయకుండా కాపాడాలి. మృత దేహాలను ఖననం చేయకూడదు, పాతిబెట్టకూడదు, నీటిలో పడవేయకూడదు. రాబందులకు, ఇతర పక్షులకు ఆహారంగా వేయాలి.జొరాస్త్ర మతము ప్రవక్త అయిన జొరాస్తర్ బోధనలపై ఆధారపడియున్నది. ఒక కథ ప్రకారం దేవుడే స్వయంగా జరాతుస్త్రకు దర్శనమిచ్చి సృష్టి రహస్యాలను, సన్మార్గంలో పయనించడానికి మానవులు పాటించవలసిన నియమాలను తెలిపాడు. జొరాస్తర్ బోధనలు జెండ్ అవెస్తా (Zend Avesta) లో దొరకుతాయి. జొరాస్త్రీయన్లు జరతుస్త్ర పుట్టుక 3000 సంవత్సరాల పాటూ సాగే సృష్టి చక్రం ఆరంభాన్ని తెలియజెప్పిందని నమ్ముతారు. బోధనలను భద్రపరచడానికి, మానవాళిని నడిపించడానికి ప్రవక్త భూమి పై ప్రతి యుగం చివరలో అవతారమెత్తుతాడు. బోధనలను భద్రపరచడానికి, మానవాళిని నడిపించడానికి ప్రవక్త భూమి పై ప్రతి యుగం చివరలో అవతారమెత్తుతాడు. జొరాస్తర్ కుమారుడైన షోశ్యాంత్ (మూడవ ప్రవక్త) తీర్పు దినాన్ని, భౌతిక ప్రపంచంలో దుష్ట శక్తుల సంహారం గురించి ప్రవచిస్తాడు.జొరాస్త్రీయన్ల నమ్మకం ప్రకారం మరణము అనేది ఆత్మ శరీరంలోంచి బయటకు వెళిపోవడం వల్ల సంభవిస్తుంది, ఆపై శరీరం అపవిత్రమైపోతుంది. ఆత్మ శరీరం నుండి బయటకు వెడలిన తరువాత 3 రోజులవరకూ ఆ శరీరం వద్ద తిరుగుతూ తరువాత దేనా అనే ఆత్మ సాయంతో ఆత్మీయ లోకానికి వెళ్ళిపోతుంది. అక్కడున్న దేవ దూత విచ్చేసిన ఆత్మ అంతిమతీర్పు దినానికి ముందు తాత్కాలికంగా స్వర్గానికి వెళ్ళాలో నరకానికి వెళ్ళాలో నిర్ణయిస్తుంది. జొరాస్త్రీయన్ల నమ్మకం ప్రకారం అంతిమ తీర్పు దినములో దేవుడు మరణించిన ఆత్మలను లేపి రెండవసారి విచారణకు సిద్ధం చేస్తాడు. అన్ని మంచి ఆత్మలు స్వర్గంలో శాశ్వత స్థానాన్ని పొందుతాయి, మిగిలిన ఆత్మలు నిత్య జీవం పొందేవరకూ తాత్కాలికంగా శిక్షలు పొందుతాయి. కొంతమంది జొరాస్త్రీయన్లు దైవ నిర్ణయం ప్రకారం ఆత్మలు పొరపాట్లను అధికమించి, సిద్దిత్వం పొందాలని భూమ్మీదే జన్మిస్తాయని, కనుక ఆత్మలు తమ వ్యక్తిత్వాన్ని శుద్ధీకరించుకోవడానికి, వెలుగుమయం చేసుకోవడానికి ఆత్మలకు భూమ్మీద జీవనం ఒక అవకాశమని నమ్ముతారు. జొరాస్త్రీయన్ పుస్తకాలు స్వర్గాన్ని సంపూర్ణ సంతోషకరమైన ప్రదేశమని, దేవుని వెలుగుతో అలంకరించబడినదని; నరకాన్ని పాపపు అత్మలు శిక్షలు పొందే శీతలమైన, చీకటియన ప్రదేశంగా చెబుతాయి.దుష్ట శక్తి వల్ల భూమ్మీద జీవనం ప్రమాదంతో కూడియున్నదని జొరాస్త్రీయన్లు నమ్ముతారు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించకపోవడము వల్ల కాదు కాని, జొరాస్తర్ చెప్పిన మూడు ఆజ్ఞలు (మంచి ఆలోచన, మాటలు, మంచి కార్యాలు) పాటించకపోవడం వల్ల మనుష్యులు వ్యభిచారము, దొంగతనము, పంచభూతాలను మలినం చేయడం, ఇతర నమ్మకాలను ఆచరించడం, చనిపోయిన వాటిని తొలగించకపోవడం, చనిపోయినవాటిని ముట్టుకోవడం, దేవుడిని ప్రార్థనలు - యాగాలు చేయకపోవడం, దెయ్యాలను ఆరాధించడం, కుస్తీ ధరించకపోవడం, పై వస్త్రం ధరించకపోవడం, దురుద్దేశ్యంతో వ్యాపారం చేయడం, లేఖనాల్లో చెప్పినట్లు వివాహం చేసుకోకపోవడం వంటి అనేక పాపాలు చేస్తారు.ప్రతీ 3000 సంవత్సరాలకు ఒకసారి దేవుడు సమస్త దుష్ట శక్తులను అంతం చేసి తీర్పు దినాన్ని ప్రకటిస్తాడు, అన్ని ఆత్మలను లేపి రెండవసారి విచారణకు గురిచేస్తాడు. ఆ విచారణలో విధేయులైన ఆత్మలు స్వర్గంలో నిత్యజీవాన్ని పొందుతాయి, మిగిలిన ఆత్మలు నరకంలో నిత్య శిక్షలకు గురవుతాయి.జొరాష్ట్రియన్లు కూడా హిందువులవలే దేవునితో సంభాషించడానికి యజ్ఞాలు నిర్వహిస్తారు. వీటినే యస్నాలు అని అందురు. మానవాళి కోసం నిర్వహించే ఈ యజ్ఞాలను అనుభవజ్ఞులైన పూజారులు తమ అగ్ని దేవాలయంలో అవెస్తాలో వాక్యములు / మంత్రాలు చదువుతూ చేస్తారు. జొరాస్త్రీయన్లు తమ దేవాలయాల్లో రోజుకి ఐదు సార్లు పూజలు నిర్వహిస్తారు. ఇదే కాకుండా నాజోత్ అనే ఉపనయన తంతును బాలురకు, బాలికలకు నిర్వహిస్తారు. నాజొట్ ను ఎవరికైనా జోరాస్త్ర మార్గంలో ప్రయాణం సాగించే ముందు చేస్తారు.

సూక్తులు

అపకీర్తి, కుటిలత్వము రాకుండునట్లు, అబద్దమాడకుము [5]అసూయ దెయ్యము నీ వైపు చూడకుండునట్లు, ప్రపంచపు నిధి ప్రీతికరముగా లేకుండునట్లు నీవు ఆశ కలిగియుండకుము.ఆవేశపడకుము, ఎందుకనగా ఆవేశము వచ్చినప్పుడు బాధ్యతలు, మంచికార్యాలు మరుగున పడును, ప్రతి పాపము ఆలోచనలోకి వచ్చును.[6]ఆందోళన పడకుము, ఎందుకనగా ఆందోళన ప్రపంచంలో ఉన్న ఆనందాన్ని అధికమించును.హాని, పశ్చాతాపము నీ వద్దకు రాకుండునట్లు, మోహపడకుము.చేవలసిన పని పూర్తి కాకుండా ఉండునట్లు సోమరితనమును చేరనీయకుము.చక్కని గుణములు కలిగిన భార్యను ఎంచుకొనుముకలిగియున్న సంపదను బట్టి గర్వించకుము, ఎందుకనగా ఆఖరిలో అన్నింటినీ వదిలేయాల్సిందే.

ప్రస్తుత స్థితి

2004 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా జొరాస్త్రీయన్ల సంఖ్య 1,45,000 నుండి 2,10,000 వరకూ ఉంది. 2001 భారత్ జనగణన ప్రకారం 69,601 పార్శీలు భారత్ లో గలరు. క్రీస్తు శకం తరువాత జొరాస్త్రీయన్లు కొన్ని వందల సంఖ్యలో భారతదేశంలో ఉన్న గుజరాత్ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. వీరినే పార్శీయులు అని అంటారు. కుస్తీ యజ్ఞోపవీతము (ఒడుగు / జంధ్యం) ధరించే ఆచారము వీరిలో కూడా ఉంది. భారత దేశంలో జోరాస్త్ర మతమునకు పార్శీ మతమనికూడా పేరు.

 ప్రముఖ పార్శీలు
దాదాభాయి నౌరోజీ, జమ్సేట్జి టాటా ,ఫిరోజ్ షా ,మెహతాఫిరోజ్ గాంధీజుబిన్ మెహతాఅర్దెషీర్ ఇరానీగోద్రెజ్ కుటుంబం, వాడియా కుటుంబం, టాటా కుటుంబం వగైరాలు.

 ప్రపంచంలోనే వీరు మహా జ్ఞానులుగా ప్రసిద్ది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో నక్షత్రాన్ని వెంబడిస్తూ వెళ్ళిన ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు ఈ జొరాస్ట్రియన్లే కావడం గమనార్హం. సికింద్రాబాద్ లోని "పార్సీగుట్ట"లో వీరి నివాసగృహాలు, స్మశానాలు ఉన్నాయి.

GK in Telugu

GK in Telugu

రాష్ట్రం       ఆవిర్భావ దినం

1.ఉత్తరప్రదేశ్26-1-1950

2.మహారాష్ట్ర1-5-1960

3.పశ్చిమబెంగాల్1-11-1956

4.బీహార్1-11-1956

5.తమిళనాడు26-11-1956

6.మధ్యప్రదేశ్1-11-1956

7.కర్నాటక1-11-1956

8.రాజస్థాన్1-11-1956

9.ఆంధ్రప్రదేశ్1-11-1956

10.ఒరిస్సా19-8-1949

11.కేరళ1-11-1956

12.అస్సోం1-11-1956

13.పంజాబ్1-11-1966

14.జమ్మూ కాశ్మీర్26-1-1957

15.గుజరాత్1-5-1960

16.నాగాలాండ్1-12-1963

17.హర్యానా1-11-1966

18.హిమాచల్ ప్రదేశ్
25-1-1971

19.మణిపూర్21-1-1972

20.త్రిపుర21-1-1972

21.మేఘాలయ21-1-1972

22.సిక్కిం16-5-1975

23.మిజోరం20-2-1987

24.అరుణాచల్ ప్రదేశ్
20-2-1987

25.గోవా30-5-1987

26.చత్తీస్ ఘడ్1-11-2000

27.ఉత్తరాఖండ్9-11-2000

28.జార్ఖండ్15-11-2000

29.తెలంగాణ2-6-2014

సాధారణ ఆమ్లాలు - సాంకేతికాలు

సాధారణ ఆమ్లాలు - సాంకేతికాలు

ఆమ్లం --- సాంకేతికం

1. హైడ్రోక్లోరిక్ ఆమ్లం --- HCl
2. సల్ఫ్యూరిక్ ఆమ్లం --- H2SO4
3. నైట్రిక్ ఆమ్లం --- HNO3
4. ఫాస్ఫారిక్ ఆమ్లం --- H3PO4
5. ఎసిటిక్ ఆమ్లం --- CH3COOH
6. కార్బొనిక్ ఆమ్లం --- H2CO3
7. సల్ఫ్యూరస్ ఆమ్లం --- H2SO3

 సాధారణ క్షారాలు - సాంకేతికాలు
క్షారం --- సాంకేతికం
1. అమ్మోనియం హైడ్రాక్సైడ్ --- NH4OH
2. కాల్షియం హైడ్రాక్సైడ్ --- Ca(OH)2
3. పొటాషియం హైడ్రాక్సైడ్ --- KOH
4. సోడియం హైడ్రాక్సైడ్ --- NaOH
5. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ --- Mg(OH)2

మూలకాల అణువుల సాంకేతికాలు
మూలకం --- సాంకేతికం
1. హైడ్రోజన్ --- H2
2. ఆక్సిజన్ --- O2
3. నైట్రోజన్ --- N2
4. అయోడిన్ --- I2
5. పొటాషియం --- K
6. బ్రోమిన్ --- Br2
7. క్లోరిన్ --- Cl2
8. సోడియం --- Na
9. కాల్షియం --- Ca
10. ఫ్లోరిన్ --- F2
11. ఫాస్ఫరస్ --- P4
12. గంధకం --- S8

భాస్వరాన్ని ఫాస్ఫరస్ అని కూడా అంటారు.
గంధకాన్ని సల్ఫర్ అని కూడా అంటారు.
సంయోగ పదార్థాల సాంకేతికాలు
సంయోగ పదార్థం --- సాంకేతికత
1. హైడ్రోక్లోరికామ్లం --- HCl
2. నత్రికామ్లం --- HNO3
3. సల్ఫ్యూరికామ్లం --- H2SO4
4. కాపర్ సల్ఫేట్ --- CuSO4
5. సోడియం సల్ఫేట్ --- Na2 SO4
6. సోడియం నైట్రేట్ --- NaNO3
7. సోడియం క్లోరైడ్ --- NaCl
8. నీరు --- H2O
9. సోడియం హైడ్రాక్సైడ్ --- NaOH

 కొన్ని మూలకాలకు ఇంగ్లిష్ పేరులోని మొదటి అక్షరాన్ని సంకేతంగా ఇవ్వాలి.

మూలకం --- సాంకేతికం

1. హైడ్రోజన్ (Hydrogen) --- H
2. ఆక్సిజన్ (Oxygen) --- O
3. నైట్రోజన్ (Nitrogen) --- N
4. కర్బనం (Carbon) --- C
5. ఫ్లోరిన్ (Fluorine) --- F
6. సల్ఫర్ (Sulphur) --- S
7. ఫాస్ఫరస్ (Phosphorus) --- P
8. అయోడిన్ (Iodine) --- I

కొన్ని మూలకాలకు ఇంగ్లిష్ పేరులోని మొదటిరెండు అక్షరాల్ని కాని, మొదటి మూడు అక్షరాల్ని కలిపి కాని మొదటి అక్షరం, మధ్యలో ప్రాముఖ్యం ఉన్న మరొక అక్షరాన్ని కలిపి కాని సంకేతంగా ఉపయోగిస్తారు.
మూలకం --- సాంకేతికం
1. అల్యూమినియమ్ (Aluminium) --- Al
2. బ్రోమిన్ (Bromine) --- Br
3. కాల్షియం (Calcium) --- Ca
4. బేరియం (Barium) --- Ba
5. హీలియం (Helium) --- He
6. నికెల్ (Nickel) --- Ni
7. సిలికాన్ (Silicon) --- Si
8. క్లోరిన్ (Chlorine) --- Cl
9. మెగ్నీషియం (Megnesium) --- Mg
10. మాంగనీసు (Magnanese) --- Mn
11. జింక్ (Zinc) --- Zn
12. ప్లాటినిమ్ (Platinum) --- Pt

 కొన్ని మూలకాలకు లాటిన్ పేర్లను అనుసరించి సంకేతాన్ని ఇచ్చారు.

మూలకం --- లాటిన్ పేరు --- సంకేతం

1. పొటాషియం --- Kalium (కాలియం) --- K
2. సోడియం --- Natrium (నేట్రియం) --- Na
3. కాపర్ --- Cuprum (కుప్రం) --- Cu
4. వెండి --- Argentum (అర్జెంటం) --- Ag
5. బంగారం --- Aurum (ఆరం) --- Au
6. పాదరసం --- Hydragyrum (హైడ్రాజిరమ్) --- Hg
7. సీసం --- Plumbum (ప్లంబం) --- Pb
8. తగరం --- Stannum (స్టాన్నం) --- Sn
9. ఇనుము --- Ferrum (ఫెర్రం) --- Fe
10. ఆంటిమొని --- Stibium (స్టిబియం) --- Sb
 కాపర్‌కు మరో పేరు రాగి.

ఎ.పి.జె. అబ్దుల్ కలాం.

ఎ.పి.జె. అబ్దుల్ కలాం. 

APJ ABDUL KALAM HISTORY IN TELUGU

APJ ABDUL KALAM BIOGRAPHY IN TELUGU

Dare to dream but care to achieve*_
 ఆయన పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం. ఆయన 1931, అక్టోబర్ 15 న రామేశ్వరంలో జన్మించారు. అప్పటికే వారి కుటుంబం పేదరికంలో ఉంది. వారి పూర్వీకుల నాటి పెంకుటిల్లు తప్ప వారికేమీ లేదు. ఆ రామేశ్వరంలోనే, ఆ చిన్నతనం లోనే బహుశా ఈనాటి కలాంకు బీజాలు పడ్డాయి.*

 ఆయనలోని మత సామరస్యానికి, మానవత్వానికీ చిన్నతనంలో రామేశ్వరం ప్రధాన ఆలయ పూజారి కొడుకుతో స్నేహమే కారణమేమో.*

 అలాగే కలాంను చిన్నతనంలో ఆకర్షించి, ఒక స్పేస్ సైంటిస్ట్ కావడానికి కారణం – రామేశ్వరం సముద్రపు ఒడ్డున నడుస్తూ పైకి చూసిన చిన్ని కలాంకు ఆకాశంలో ఎగురుతూ కనిపించిన పక్షులే. వాటి నుంచి స్ఫూర్తి పొందిన కలాం ఒక ఫైటర్ పైలట్ కావాలనుకున్నారు.*

 అలాగే చిన్న నాటి నుండి తాను మరణించే వరకూ ఆయన స్నేహం చేసింది పుస్తకాలతోనే. రామేశ్వరంలోని గ్రంధాలయానికి వెళ్లి తాను కొనలేని ఎన్నో పుస్తకాలను అక్కడే చదివేవారు ఆయన. అలాగే కుటుంబ పోషణకు, అన్నలకు సహాయం చేయాలని పేపర్ బాయ్ గా కూడా పని చేయడానికి సిగ్గు పడలేదు ఆయన.*

 అలాగే చదువు విషయానికి వస్తే తాను యావరేజ్ స్టూడెంట్ నని ఆయనే తన ఆత్మ కధలో రాసుకున్నారు. అయితే చదువు మీద ఆసక్తితో కష్టపడి చదివేవారు. అలా ఆయన తిరుచ్చిరాపల్లిలోని సెయింట్ జోసెఫ్ కళాశాల లో 1954 లో ఫిజిక్స్ లో గ్రాడ్యుయేషన్ చేసారు. దాని తరువాత మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో 1955 లో ఏరో స్పేస్ ఇంజనీరింగ్ చేశారు.*

 చదువు తరువాత IAF లో చేరాలన్న తన పైలట్ కల తృటిలో తప్పిపోయింది. ఆయన పరీక్షలో 9వ స్థానంలో నిలిచారు. కానీ అప్పటికి భారత వాయుదళంలో ఎనిమిది స్థానాలే ఖాళీగా ఉండటంతో పైలట్ కావాలన్న ఆయన కల తృటిలో తప్పిపోయింది.*

ఇక అక్కడి నుంచి ఆయన సాగించిన పయనం, గగనతలంలో భారతీయ జెండా ను రెపరెపలాడేలా చేసింది. ఆయన DRDO లో సైంటిస్ట్ గా చేరారు. అక్కడి నుంచి ఆయన ISRO లో చేరారు. అక్కడ ప్రొ. విక్రం సారాభాయ్, సతీష్ ధావన్ ల నుంచి స్ఫూర్తిని పొందారు. అక్కడ ఆయన దేశానికి అనన్యసామాన్యమైన సేవలందించారు.*

 ఆయన పి ఎన్ ఎల్ వి, ఎస్ ఎల్ వి – III, అగ్ని, పృథ్వి, వంటి క్షిపణులను తయారు చేశారు. అలాగే పోక్రాన్ న్యూక్లియర్ పరీక్షలను సైతం విజయవంతం చేశారు. తన సేవలకు గాను ఆయన మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరొందారు.*

 అలాగే ఆయన ప్రధానికి చీఫ్ సైంటిస్ట్ అడ్వైజర్ గా కూడా పని చేశారు. ఈ సేవలే ఆయనకి 2002 – 2007 కాలానికి భారత దేశ పదకొండవ రాష్ట్రపతిగా పని చేసేలా చేశాయి. ఈ సమయంలో ఎంతో మంది ఉరి శిక్ష పడ్డ ఖైదీలకు ప్రాణ భిక్ష పెట్టారు. అంత పెద్ద రాష్ట్రపతి భవన్ లో సైతం ఆయన ఒక్క గదిలో, గది నిండా పుస్తాకాలతో మాత్రమే జీవించారు. రాష్ట్రపతి భవన్ లో ఇచ్చే విలాస విందులను తిరస్కరించారు. ఏమైనా వండి పెట్ట గల వంట వాళ్ళతో కేవలం ఇడ్లి సాంబారు మాత్రమే వండించుకున్న ఆయన నిరాడంబరత మనందరికీ ఆదర్శం.*

 తాను మరిణించిన రోజును సెలవు దినంగా ప్రకటించ వద్దని కోరిన మహనీయుడు. ప్రెసిడెంట్ గా ఉన్న రోజుల్లో కూడా ఎన్నో విద్యాలయాలకు వెళ్లి అక్కడి విద్యార్థులకు బోధించేవారు. మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు అన్న ప్రశ్న కు – ఆ ఆలోచనే రాలేదు, అన్న ఆయన నుంచి వృత్తి పట్ల అంకిత భావం నేర్చుకోవచ్చు.*

 ఆయన పదవీ కాలం పూర్తయ్యాక అదే పనిగా ఎన్నో విద్యాలయాలకు వెళ్లి ఎంతో మంది విద్యార్థులకి బోధించారు. పిల్లలకు, విద్యార్థులకు బోధించడం ఆయనకెంతో ఇష్టమైన పని.*

 భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న 1997 లో ఆయన్ని వరించింది. అంతకు ముందే పద్మ భూషణ్ ను 1981 లో, పద్మ విభూషణ్ ను 1990 లో అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 40 విశ్వ విద్యాలయాలు ఆయన్ని డాక్టరేట్ తో సత్కరించాయి.*

 ఇంతే కాక ఆయన ఎన్నో సామాజిక కార్యక్రమాలను కూడా చేపట్టారు. కార్డియాలజిస్ట్ సోమరాజుతో కలిసి ఆయన సామాన్యులకు అందుబాటు ధరలో ఒక స్టంట్ ను తయారు చేశారు. దానికి రాజు కలాం స్టంట్ అని పేరు వచ్చింది*

 ఆయన మరణించే సమయానికి తన పేరు మీద ఆస్తులేమీ లేవంటే, ఆయన నిరాడంబరతకీ, వ్యక్తిత్వానికీ ఇది పరాకాష్ట.*

 ఆయన ఎన్నో కవితలూ, పుస్తకాలూ రాశారు. Wings of Fire, Ignited Minds, India 2020 వంటి పుస్తకాలతో ఆయన ఆలోచనలనూ, భావాలనూ మనతో పంచుకున్నారు.*

 విశ్వశాంతికి మనిషి సత్ప్రవర్తనే మూలమని కలాం చెప్పిన వ్యాఖ్యలకు యూరోపియన్ పార్లమెంట్‌ కరతాళ ధ్వనులతో మారుమోగింది..! యూరోపియన్ పార్లమెంట్‌లో కలాం చేసిన ఈ ప్రసంగం ప్రపంచలోనే వన్ ఆఫ్‌ ది బెస్ట్ స్పీచ్‌గా పేరుగాంచింది..!*

 సృజనాత్మకత, సత్ప్రవర్తన, ధైర్యం మూడింటి మేళవింపును నిజమైన జ్ఞానంగా కలాం ఉద్బోధించారు..! మార్కుల కొలమానమే జ్ఞానంగా మారిన మన విద్యా వ్యవస్థ మారాలని అబ్దుల్ కలాం బలంగా ఆకాంక్షించారు..! విలువలతో కూడిన విద్యను అందించినవే పరిపూర్ణ విశ్వవిద్యాలయాలని తెలిపారు..!*

 ఏ మనిషీ సాధించని విజయం సాధించాలంటే గతంలో ఎవ్వరూ చేయని యుద్ధం చేయమని యువతకు ఉద్బోధించారు కలాం..!  కలలంటే నిద్రలో వచ్చేవని అందరికీ తెలుసు… కానీ మనిషిని నిద్ర పోనీయకుండా చేసేవే కలలని కలాం కొత్త అర్థం చెప్పారు..! సూర్యుడిలా ప్రకాశించాలంటే సూర్యుడిలా పేదరికం లేని దేశం..! ఆకలి చావులు లేని రాజ్యం..! పట్టణ, పల్లె ప్రాంతాలకు వ్యత్యాసం లేని దేశం..! వ్యవసాయ, పారిశ్రామక, సేవా రంగాలు కలగలిసి ప్రగతి దిశగా సాగే దేశం..! అవినీతి రహిత, పక్షపాత రహిత పాలన గల దేశం..!… మహిళలు, పిల్లల హక్కులకు సంపూర్ణ రక్షణ గల దేశం..! ఇదీ 1998లో అబ్దుల్ కలాం కలలుగన్న భారత దేశం..! మిషన్‌2020 పేరుతో భారతావనికి నిజమైన అభివృద్ధి పథాన్ని చూపించిన దార్శనికుడు అబ్దుల్ కలాం..!*

 మీ లక్ష్యసాధనలో అవరోధాలు ఎదురైనాయా ? గమ్యాన్ని చేరడం కష్టమనిపిస్తుందా ..? నీరసం, నిస్సత్తువ ఆవహించిందా..? ఏం ఫర్వాలేదు… ఒక్కసారి కలాం ప్రసంగం వినండి… రెట్టించిన ఉత్సాహం నిండుకుంటుంది..! లక్ష్యసాధన దిశగా మిమ్మల్ని పరుగులు పెట్టిస్తుంది..!*

ప్రస్తుత సామాజిక రాజకీయ సమాజంలో ఉన్నప్పటికీ, ఎన్ని కీలకమైన పదవులు అలంకరించినప్పటికి తామరాకు మీద నీటి బొట్టు లాగా వాటికి అతీతంగా ఉండడం బహుశా ఆయనకే సాధ్యమేమో.*

 ఇక కలాం జీవితం గురించి చెప్పుకున్నట్టె ఆయన మరణం గురించి కూడా చెప్పుకోవాలి. చివరి శ్వాస వరకు కూడా ఆయన విద్యా బోధనకే అంకితం అయిన మహా మనీషి ఆయన. షిల్లాంగ్ లో IIM విద్యార్ధులకు బోధిస్తూ కుప్పకూలి పోయారు. హాస్పిటల్ కు తీసుకువెళ్ళి చికిత్స చేస్తున్నప్పుడే కన్ను మూశారు. అసలు అటువంటి మరణం చరిత్రలో ఇంత వరకూ ఎవరికీ రాలేదనే చెప్పాలి.*

 వయసు మీద పడుతున్న సరే, విద్యా బోధనే లక్ష్యంగా సాగిపోయిన ఆయనను అపర భీష్ముడు అన్నా అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే 83 ఏళ్ల వయసులో జీవితం తుది శ్వాస వరకూ తనమేధస్సునూ, శక్తి సామర్ధ్యాలనూ ఈ జాతికి అంకితం చేసి, తనకు ఎంత అధికారం వున్నా తనకోసం ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా జీవితాన్ని గడిపిన ఆయన వెళ్ళిపోయిన లోటు ఈ దేశానికి తీరనిది.*

 ఆయన మేధస్సుకు కొలమానం లేదు, ఆయన వ్యక్తిత్వానికి సాటి లేదు. వినయశీలి, నిగర్వి, సమయపాలన, సేవా నిరతి, శ్రమ జీవి, నిరాడంబరత ఇలా ఎన్నో సుగుణాలు ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాలి.   ఆయన నుంచి స్ఫూర్తి పొందిన మరో కలాం మళ్ళీ ఎప్పటికి పుడతాడో ....*

ఇవి మీకు తెలుసా?

ఇవి మీకు తెలుసా?

ప్రశ్న: నిర్జీవ తోకచుక్క అంటే ఏమిటి?

జవాబు: తోకచుక్కలు సూర్యకుటుంబంలో ఉండే చిరు సభ్యులు. వాటి వ్యాసం కొన్ని మీటర్లు మాత్రమే ఉంటుంది. తోకచుక్కలు దుమ్ము, తారు, మంచుగడ్డల (నీరు, అమోనియా, మీథేన్‌, కార్బన్‌డైఆక్సైడ్‌) సమ్మేళనం. వాటి కేంద్రం మాత్రం రాతిమయం.
తోకచుక్క సూర్యుని దగ్గరకు వచ్చిన ప్రతిసారీ దానిలోని మంచుగడ్డ నేరుగా వాయురూపంలోకి మారి మంచుపొగలా ఏర్పడుతుంది. అలా ఏర్పడిన వాయువు, తోకచుక్కలో అంతకు ముందున్న దుమ్ము కణాలు సూర్యుని నుంచి దూరంగా ప్రవహించడంతో వాటికి ‘తోక’ ఏర్పడుతుంది. గురుగ్రహం కన్నా సూర్యునికి దగ్గరగా వచ్చిన తోకచుక్క చురుకైన జీవితకాలం పదివేల సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. దాని తర్వాత అది నిర్జీవమైనట్లే. ఆ దశలో దానికి తోక లేక పోవడంతో దానిని ‘ఆస్టరాయిడ్‌’గా అనుకొనే ప్రమాదం ఉంది. ఆ దశలో తోకచుక్కలకు, ఆస్టరాయిడ్లకు మధ్య ఉండే తేడా అంత స్పష్టంగా శాస్త్రజ్ఞులకు తప్ప అందరికీ తెలియదు. దానికి కారణం ఆస్టరాయిడ్లు కూడా తోక చుక్కల్లాగే తమలో ఉండే మంచుగడ్డలను భాష్పీకరణం చెందించడం ద్వారా ఒక రకమైన దుమ్మును వెదజల్లడమే.

ప్రశ్న: వెండి పట్టీలు పెట్టుకొంటే శరీరంలోని వేడి తగ్గుతుందంటారు. నిజమేనా?

జవాబు: వెండి, రాగి, బంగారం వంటి లోహాలకు చాలా ఘన పదార్థాలకన్నా అధిక ఉష్ణ వాహక లక్షణం ఉంది. కానీ ఇలాంటి ఆభరణాలను ధరించడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుందనుకోవడంలో శాస్త్రీయత లేదు. అలా అనుకోవడం కేవలం అపోహ మాత్రమే. మనం ఎండాకాలం బస్సులో సీటు పట్టుకొన్నప్పటి కన్నా పైన ఉన్న లోహ కడ్డీని పట్టుకొంటే వేడిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే లోహ కడ్డీ కన్నా సీటు తక్కువ ఉష్ణోగ్రతతో ఉందని అర్థం చేసుకోకూడదు. ఆ రెండు భాగాలకు ఒకే ఉష్ణోగ్రత ఉంటుంది. కేవలం ఉష్ణోగ్రత వ్యత్యాసాలు బాగా ఉంటేనే వేడి అధిక ఉష్ణోగ్రతా ప్రాంతాల నుంచి అల్ప ఉష్ణోగ్రతా ప్రాంతాలకు ప్రవహిస్తుంది. ఎండాకాలం శరీర ఉష్ణోగ్రత కన్నా బయటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ పరిస్థితి శరీరానికి మంచిది కాబట్టి ఉష్ణోగ్రత పెరగకుండా ఉండడానికి చెమట పట్టే యంత్రాంగం మన శరీరానికి ఉంది. వెండి పట్టీలు మంచి ఉష్ణవాహకాలు కాబట్టి ఒకవేళ అవి పెట్టుకొంటే అనవసరంగా అధిక ఉష్ణం బయటి నుంచి శరీరంలోకి వెళ్లే అవకాశం ఉంది. అది నష్టదాయకం.
చలికాలంలో శరీర ఉష్ణోగ్రత కన్నా బయటి ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. శరీరం చల్లబడకుండా ఉండేందుకే మనం స్వెటర్లు వేసుకుంటాం. ఒక వేళ వెండి పట్టీలు వేసుకొంటే అనవసరంగా శరరీంలోని వేడి బయటి పోయే ప్రమాదం ఉంది. ఇది కూడా లాభదాయకం కాదు. ఎటు చూసినా వెండి పట్టీలకున్న అధిక ఉష్ణవాహక లక్షణం మనకు లాభదాయకం కాకపోగా నష్టాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి బంగారు, వెండి నగలు అలంకారప్రాయానికే గానీ వీటి వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు ఏ మాత్రం లేదు. కొద్దో గొప్పో సంబంధం ఉన్నా అదీ అవాంఛనీయ ప్రభావమే.


ప్రశ్న: కొన్నిసార్లు అప్పుడే పుట్టిన బిడ్డను ఇంక్యుబేటర్‌లో ఉంచుతారు. ఎందుకు?

జవాబు: నెలలు నిండక ముందే పుట్టిన శిశువులు కొందరు ఒక కిలోగ్రాము కన్నా తక్కువ బరువుతో ఉండటమే కాకుండా, శారీరకంగా చాలా బలహీనంగా, అనారోగ్యంతో ఉంటారు. అలాంటి వారికి హాని కలగకుండా వైద్యులు ఆరోగ్యకరమైన పరిసరాలను ప్రసాదించే ‘ఇంక్యుబేటర్‌’లో ఉంచుతారు. ఎయిర్‌ కండిషన్‌ గది లాంటి ఈ చిన్న గదిలో పరిసరాల్లో ఉండే వ్యాధికారకాలైన సూక్ష్మక్రిముల నుంచి రక్షణ లభిస్తుంది. అందులో ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌గానూ, ఆక్సిజన్‌ 40శాతం మేర ఉంటుంది. ఈ ఆక్సిజన్‌ పరిమాణం వెలుపలి వాతావరణంలోని ఆక్సిజన్‌ కన్నా రెండింతలు ఉంటుంది. ఇంక్యుబేటర్‌ తనకై తాను వాతావరణాన్ని నియంత్రించుకొనే ఒక ప్రత్యేకమైన ఎయిర్‌ కండిషన్డ్‌ వ్యవస్థ కలిగి ఉండే గది. దానిలో అమర్చి ఉండే ఒక చిన్న మోటారు పరిసర వాతావరణం నుంచి ఒక ఫిల్టర్‌ ద్వారా బ్యాక్టీరియాలేని పరిశుద్ధమైన గాలిని ఆ గదిలోకి తీసుకురావడమే కాకుండా అక్కడి ఉష్ణోగ్రతను గాలిలోని తేమను కూడా నియంత్రిస్తుంది. అవసరమైన మేరకు ఆక్సిజన్‌ను అందిస్తుంది. ఇంక్యుబేటర్‌లోకి నిమిషానికి ఆరు లీటర్ల పరిశుభ్రమైన గాలి నిరంతరం సరఫరా కావడంతో అందులోని పీడనం పరిసరాల్లోని వాతావరణ పీడనం కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అందులోని వాయు ప్రవాహం ఎప్పుడూ వెలుపలి వైపుకే ఉంటుంది. దాంతో శిశువు శ్వాస నుంచి వెలువడిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ ఆ గది నుంచి వెలుపలకు వస్తుంది. నెలలు నిండక ముందే పుట్టిన శిశువును మొదట కొన్ని వారాలు ఇంక్యుబేటర్‌లో ఉంచుతారు. శిశువుకు ఆహారం అందించడం, బరువును తూచడం(బరువును కనుగొనే ప్రత్యేక ఏర్పాటు అందులోనే ఉంటుంది) ఎప్పటికప్పుడు శిశువును పరిశుభ్రంగా ఉంచడం, మైనర్‌ ఆపరేషన్స్‌, ఎక్స్‌-రే ఫొటోగ్రాఫులను తీయడం లాంటివి శిశువును ఇంక్యుబేటర్‌లో నుంచి వెలుపలకు తీయకుండానే డాక్టర్లు, నర్సులు అందుకు అమర్చి ఉండే ప్రత్యేకమైన రంధ్రాల ద్వారా చేస్తారు. ఇంక్యుబేటర్‌లో విద్యుత్‌ సరఫరా ఆగిపోవడం, నీరు, ఆక్సిజన్‌ సరఫరాల అంతరాయం, ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులను, ఆక్సిజన్‌ సరఫరా ఎక్కువయ్యే ప్రమాదాలనూ అందులో ఉండే ప్రత్యేకమైన అమరికలు వెంటనే తెలియజేయడమే కాకుండా సరిచేస్తాయి.

ప్రశ్న: కారు, బస్సు వేగంగా వెళ్తునప్పుడు చక్రాలు వెనక్కి తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఎందుకు?

జవాబు: ఇలాంటి దృశ్యాలు ప్రత్యక్షంగా కనిపించవు. కేవలం సినిమాలు, టీవీలలో మాత్రమే కనిపిస్తాయి. ట్యూబులైట్‌ వెలుతురు ఉన్న గదిలో తిరిగే సీలింగ్‌ ఫ్యాను రెక్కలు కూడా వెనక్కి తిరుగుతున్నట్లు కనిపిస్తాయి. ఇలాంటి స్థితిని ‘దృష్టిభ్రమ’ (ఆప్టికల్‌ ఇల్యూషన్‌) అనే అంశంగా సూత్రీకరించారు. గుండ్రంగా ఉన్న వస్తువు తిరుగుతున్నప్పుడు దాని అక్షం నుంచి అంచుల వైపునకు వెళ్లే సెక్టార్లు వాటిని విభజించే గోడలు అన్నీ ఒకే తీరుగా ఉన్న సందర్భాల్లో ఇలాంటి ‘దృష్టిభ్రమ’ అనుభవంలోకి వస్తుంది. సినిమా లేదా టీవీలో బొమ్మల కదలికలు ఫ్రేముల మార్పిడి ద్వారా సంభవిస్తాయి. ఒక ఫ్రేములో ఉన్న బొమ్మను కన్ను గుర్తించాక ఆ దృశ్యం మన మెదడులో సెకనులో సుమారు 16వ వంతు కాలం వరకు అలాగే ఉంటుంది. ఈలోగా ఆ తదుపరి ఫ్రేములోని బొమ్మలోకి సాధారణ కదలికలో ఉన్న సెక్టారు లేదా సెక్టారు గోడ వచ్చినా, అది మెదడులో ఇంకా చెరిగిపోని గత ఫ్రేములోని దృశ్యానికి ముందు వైపున ఉన్నట్లయితే చక్రం ముందుకే తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. కానీ అదే రెండో ఫ్రేములోని దృశ్యం, మెదడులో ఇంకా చెరిగిపోని దృశ్యానికి వెనుక వైపున ఉన్నట్లయితే మన మెదడు రెండో బొమ్మను మొదటి బొమ్మను సరిపోల్చుకుని చక్రం వెనక్కి తిరుగుతున్నట్లు భ్రమ పడుతుంది.

పిట్టచూపు తగిలితే చిన్నపిల్లలు సన్నగా అయిపోతారంటారు నిజమేనా?

జవాబు: ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అని విన్నాంగానీ ‘పిట్ట చూపు పిల్లలకు చిన్నరూపు’ అని ఎక్కడా వినలేదు. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ఈ మధ్య వింత వింత వార్తలు, నిరాధార ప్రకటనలు కనిపిస్తున్నాయి. మనం శాస్త్రీయ దృక్పథంతో ఉండాలని భారత రాజ్యాంగంలోనే ఉంది. పిట్టచూపు పిల్లలపై పడితే ఆ చూపునకు, పిల్లల రూపు రేఖలకు, పెరుగుదలకు ఏ విధమైన అవినాభావ సంబంధమూ లేదు. పిట్టచూపు పెద్దలు, చెట్లు, పురుగుల మీద కూడా ఉంటుంది కదా. మరి తగ్గుదల చిన్న పిల్లలకు మాత్రమే ఎందుకుంటుంది. పిట్టచూపు తగులుతుందనుకోవడం కేవలం అశాస్త్రీయమైన మూఢనమ్మకం.


ప్రశ్న: గుడ్లగూబలు రాత్రివేళల్లోనే ఎందుకు తిరుగుతాయి?

జవాబు: పక్షులు మామూలుగా రాత్రి వేళకన్నా పగటి పూటే బాగా చూడగలుగుతాయి. కానీ పక్షి జాతికి సంబంధించిన గుడ్లగూబ చూసే శక్తి మిగతా పక్షుల కన్నా చాలా తక్కువ. గుడ్లగూబల కంటి నిర్మాణం మిగతా పక్షులలాగా ఉండకపోవడంతో అవి పగటివేళ సూర్యరశ్మిలో సరిగా చూడలేవు. రాత్రివేళల్లో అంత స్పష్టంగా కాకపోయినా చాలామటుకు చూడగలవు. అందువల్ల అవి పగటి వేళ బయటకు రాకుండా చెట్లపైనే కునికిపాట్లు పడుతూ ఉంటాయి. రాత్రివేళల్లో కూడా చూసే శక్తి తక్కువ కాబట్టి అవి ఆహారం కోసం రాత్రిళ్లు మిగతా ప్రాణులను వేటాడేటపుడు కంటి చూపు వల్ల శక్తితో పాటు చెవుల ద్వారా వినే శక్తిని ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. వాటి వినేశక్తి ఎంత తీక్షణంగా ఉంటుందంటే మన చెవులు వినలేని వేర్వేరు పౌనఃపున్యాలు ఉండే శబ్దాలను అవి ప్రస్ఫుటంగా వినగలవు. తాము వేటాడే ప్రాణులకు ఏమాత్రం తెలియకుండానే వాటి చిన్న చిన్న కదలికల వల్ల ఉత్పన్నమయే శబ్దాలను కూడా గుడ్లగూబలు గ్రహించి వాటిని తటాలున పట్టుకుంటాయి. పంటలకు నష్టం కల్గించే పురుగులు, మిడతలు, ఎలుకలు రాత్రివేళల్లో పొలాల్లో విశ్రాంతి తీసుకుంటుంటాయి. రాత్రిపూట సంచరించే గుడ్లగూబలు వాటిని వేటాడుతూ రైతులకు ఎంతో మేలు చేస్తాయి. రాత్రి వేళల్లో సంచరించే గుడ్లగూబల కళ్లు తీక్షణంగా మెరుస్తూ ఎదుటి వారికి భయం కలిగించడమే కాకుండా వాటి అరుపులు కూడా కర్ణకఠోరంగా ఉంటాయి.

కప్పలు ఎందుకు అరుస్తాయి?

కప్ప శరీరానికి పాముచే కరవబడి దెబ్బతిన్నప్పుడు అరిచే శబ్దము మూలుగుతూ ఉన్నట్లు ఉంది ... ఆ అరుపు ఆడ మగ రెండూ చేస్తాయి. వానజల్లు రావడముతో ఒక్క మగకప్పలే అరుస్తాయి. గొంతుభాగములో మగకప్పలకుండే గాలితిత్తులలోకి గాలిని తీసుకొని ఒత్తిడితో బయటకు పంపడము వల్ల ఆ అరుపులు వస్తాయి. ఈ అరుపులు ఆడ కప్పలను ఆకట్తుకునేందుకు చేసే శబ్దాలు . అందుకే ఒక్కొక కప్పజాతి అరుపు ఒక్కోలా ఉంటుంది . ఆడకప్ప ఆకర్షింపబడి దగ్గరకు వచ్చేసరికి ఆ అరుపు తీరు మారుతుంది.


ప్రశ్న: శీతకాలంలో నోటి ద్వారా గాలి వదిలితే తెల్లగా, పొగలాగా వస్తుంది. ఎందుకు?

జవాబు: శీతకాలంలో మనం శ్వాస క్రియలో భాగంగా ముక్కు ద్వారా గాలి వదిలినా, మాట్లాడుతున్నప్పుడు గాలి బయటికి వస్తున్నా అది పొగ రూపంలో రాదు. పొగలాగా, ఆవిరిగా అది మారడానికి కారణం బయట ఉన్న గాలి మాత్రమే. మనం వదిలిన గాలి మన శరీర ఉష్ణోగ్రత (సుమారు 37 డిగ్రీలు సెంటిగ్రేడ్‌) వద్ద ఉంటుంది. కానీ శీతకాలంలో బయటి గాలి ఉష్ణోగ్రత సుమారుగా 10 డిగ్రీలు నుంచి 15 డిగ్రీల సెంటిగ్రేడ్‌ ఉంటుంది. మనం మాట్లాడు తున్నప్పుడు ముక్కు ద్వారా నిశ్వాస క్రియలో బయట పడే గాలి మాత్రం శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉంటుంది. ఒక్కసారిగా అది బయటికి వచ్చి, బయట ఉన్న చల్లని గాలితో సంపర్కం చెందినపుడు ఉష్ణోగ్రతను కోల్పోతుంది. అలా మనం వదిలిన గాలిలో ఉన్న నీటి ఆవిరి చిన్నపాటి నీటి బిందువులు (తుంపరలు)గా మారుతుంది. ఈ బిందువులకు కొల్లాయిడల్‌ లక్షణాలు ఉంటాయి. అంటే అవి కాంతిని పరిక్షేపణం (స్కాటరింగ్‌) చేస్తాయి. ఈ దృగ్విషయాన్ని ‘టిండాల్‌’ ఫలితం అంటారు. అలా కాంతి పరిక్షేపణం చెందడం వల్ల నీటి ఆవిరి పొగలాగా కనిపిస్తుంది.


ప్రశ్న: మొక్కలకు కదలిక ఉంటుందా?
జవాబు: మొక్కలకు కదలిక ఉంటుంది. అలాగని అవి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలస వెళ్లవు. మొక్కలు పెరిగే కొలదీ వాటి కాడలు, చిరు కొమ్మలు, సూర్యరశ్మి తగిలే వైపు వూగుతూ, గుండ్రంగా తిరుగుతూ, గురుత్వాకర్షణ శక్తిని అధిగమిస్తూ, పైవైపుకు కదులుతూ పెరుగుతాయి. రాత్రి వేళల్లో మొక్కలకుండే ఆకులు, పూలు ముడుచుకునే కదలికలను శాస్త్రజ్ఞులు మొక్కలు నిద్రపోతున్నాయని అభివర్ణిస్తారు.
రాత్రివేళల్లో వాటి ఆకుల దొప్పలు కాండం వైపు ముడుచుకునేటట్లు కదులుతాయి. ఇలా ముడుచుకోవడానికి అవసరమయ్యే కదలికలను సులువుగా కల్పించడానికి ఆ మొక్కల ప్రతి ఆకు కింది భాగం కాండాన్ని కలుపుతూ ఒక చిన్న ‘జాయింట్‌’ కణుపు రూపంలో ఉంటుంది. ఈ జాయింట్‌ ద్వారా కాండంలో ఉండే ద్రవ సంబంధిత పీడనం ఆకును కదిలిస్తుంది. ఇలా ఆకులు ముడుచుకోవడం వల్ల రాత్రి వేళల్లో వాటికి చలి నుంచి రక్షణ లభిస్తుంది. ప్రఖ్యాత భారతీయ శాస్త్రజ్ఞుడు సర్‌ జగదీశ్‌చంద్రబోస్‌ శాస్త్రీయ పరికరాల సాయంతో మొక్కలలోని కదలికలను పరిమాణాత్మక విశ్లేషణ (Quantitative analysis) రూపంలో విశ్లేషించి, మొక్కలకు ప్రాణం ఉందని నిర్ధరించారు.


ప్రశ్న: బోరు బావుల నుంచి బయటికి వచ్చే నీరు శీతకాలం వెచ్చగా, వేసవికాలం చల్లగా ఉంటాయి. ఎందువల్ల?
జవాబు: పగలు సూర్య కాంతి ఎక్కువగా ఉండటం వల్ల భూమి పైపొర వేడెక్కుతుంది. రాత్రిపూట సూర్యకాంతి లేకపోవడం వల్ల భూమి చల్లబడుతుంది. కానీ పై పొరలో ఉన్న పగటి వేడి బోరు బావిలోని నీరున్న కింది పొరలోకి వెళ్లడానికి సమయం పడుతుంది. అందువల్ల పగలు ఇంట్లో ఉన్న బిందెలోని నీరు ఎండ వల్ల వెచ్చగా ఉన్నా బోరు బావిలోని నీరు అదే వెచ్చదనంతో ఉండదు. కానీ రాత్రి పూట మీరు ఎండాకాలంలో బోరు నీళ్లు కొట్టినట్లయితే అవి కాస్త వెచ్చగానే ఉంటాయి. అంటే ఆ పాటికి మాత్రమే పగటి వేడి లోపలి నీటికి చేరిందన్న మాట. అలాగే చలికాలంలో బయట పగలు చల్లగానే ఉన్నా కిందటి రోజు పగటి కాంతి వల్ల ఆలస్యంగా ఎంతో కొంత వేడెక్కిన నీరు బోరు బావిలో నుంచి బయటికొస్తుంది. బోరు నీళ్లు ఇలా పగలు వేసవికాలంలో చల్లగా, చలికాలంలో కాస్త వెచ్చగా అనిపించడానికి కారణం భూమి పొరలలో ఉష్ణ ప్రవాహం ఆలస్యం కావడమే!


ప్రశ్న: భూమిపై నీరు అంతరిక్షంలోని తోకచుక్కల నుంచి వచ్చిందా?

జవాబు: శాస్త్రజ్ఞులు చాలామంది విశ్వంలో తోకచుక్కల దాడి సౌరవ్యవస్థ ఏర్పడిన తొలిరోజుల నుంచే ఆరంభమైందని భావిస్తున్నారు. తోకచుక్కలు ఢీకొనడం వల్ల చెడు, మంచి రెండు ప్రభావాలూ ఉన్నాయని వారి వాదన. తోకచుక్కలు భూమిని ఢీకొనడం ద్వారా భూమిపైకి ప్రాణాధారమైన నీటితో పాటు, సంక్లిష్టమైన కార్బన్‌ పరమాణువులను భూమికి తీసుకు వచ్చాయి. అంతరిక్షం నుంచి ఇది భూమికి రావడం వల్లే భూమిపై అంత త్వరగా ‘జీవం’ అంటూ ఏర్పడింది.
మరికొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం ‘జీవం’ తోకచుక్కల్లోనే ఏర్పడిందని. వారి వాదన ప్రకారం జీవానికి అవసరమైన ఉష్ణశక్తి తోకచుక్కల్లో ఉండే రేడియోధార్మిక విచ్ఛిన్నం వల్ల ఉత్పన్నమైందనీ ఆ ఉష్ణం తోకచుక్కల్లో ఉండే మంచుగడ్డలను నీరుగా మార్చిందని ఈ వాదనలలోని నిజానిజాలను నిర్ధరించడానికి తోకచుక్కలలోని పదార్థాలను విశ్లేషించవలసి ఉంటుంది. అందుకోసమై ‘యూరోపియన్‌ స్పేస్‌ ప్రోబ్‌ రొసెట్టా’ను శాస్త్రజ్ఞులు 2014లో ప్రయోగించారు. దీనిలో ఉండే డ్రిల్‌(బరమా) తోకచుక్కల ఉపరితలంపై సన్నని రంధ్రం ఏర్పరచి వాటి అంతర్భాగాల్లోని పదార్థాపు నమూనాలను సేకరించి వాటిని ప్రోబ్‌కు అనుసంధానింపబడి ఉండే ప్రయోగ శాలకు అందిస్తుంది. అక్కడ ఆ పదార్థాల విశ్లేషణ జరుగుతుంది.

Thursday, August 3, 2017

చండీ యాగం ఎందుకు చేస్తారు?

చండీ యాగం ఎందుకు చేస్తారు?

యాగం అంటే అదో పెద్ద క్రతువు. వేదకాలంలో మాత్రమే సాధ్యమయ్యే ఆచారం. కానీ యాగానికి వచ్చే ఫలితం దృష్ట్యా ఇప్పటికీ కొందరు ఎన్ని వ్యయప్రయాసలకి ఓర్చయినా సరే యాగం చేయాలని సంకల్పిస్తూ ఉంటారు. వాటిలో ప్రముఖంగా వినిపించేది చండీయాగం!
ఎవరీ చండి?
చండి అంటే ‘తీవ్రమైన’ అన్న అర్థం వస్తుంది. అందుకనే సానుకూలమైన, ప్రతికూలమైన మాటలు రెండింటికీ ఈ పదాన్ని వాడతారు. చండి అన్న దేవత గురించి పురాణాలలో అనేకమైన ప్రస్తావనలు కనిపిస్తాయి. పూర్వకాలంలో శుంభ, నిశుంభులు అనే రాక్షసులను సంహరించేందుకు అమ్మవారు, చండి అవతారాన్ని ధరించిందట. తన శౌర్యంతో ఆమె శుంభ, నిశుంభులనే కాకుండా వారి సేనాధిపతులైన చండముండాసురులను కూడా సంహరించింది.

పూజలు
చండీదేవినీ, ఆమె తేజోరూపమైన చాముండీదేవినీ కొలిచేందుకు దేశంలో చాలా ఆలయాలే ఉన్నాయి. హరిద్వార్లో ఆదిశంకరాచార్యులు నిర్మించినట్లుగా చెబుతున్న ఆలయం దగ్గర నుంచీ, మైసూరు పాలకులు నిర్మించిన ఆలయం వరకూ ఈ తల్లిని కొలుచుకునేందుకు ప్రత్యేకమైన క్షేత్రాలు ఉన్నాయి. ఆంతేకాదు! గ్రామదేవతగా, కులదేవతగా కూడా చండీదేవికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఇక సప్తమాతృకలలో ఒకరుగా, 64 తాంత్రిక దేవతలలో ముఖ్యురాలిగా... తంత్ర విద్యలలో కూడా చాముండేశ్వరిది ప్రత్యేక స్థానం.

చండీయాగం
మార్కండేయ పురాణంలో దుర్గాదేవిని స్తుతిస్తూ సాగే ఏడువందల శ్లోకాల స్తుతిని దుర్గాసప్తశతి అంటారు. దీనికే చండీసప్తశతి అని కూడా పేరు. హోమగుండంలో అగ్నిప్రతిష్టను గావించి ఈ దుర్గాసప్తశతి మంత్రాలను జపించడంతో చండీయాగం సాగుతుంది. చండీదేవికి ప్రీతిపాత్రమైన నవాక్షరి వంటి మంత్రాలను కూడా ఈ సందర్భంగా జపిస్తారు. యాగంలో ఎన్నిసార్లు దుర్గాసప్తశతిని వల్లెవేస్తూ, అందులోని నామాలతో హోమం చేస్తారో... దానిని బట్టి శత చండీయాగం, సహస్ర చండీయాగం, ఆయుత (పదివేలు) చండీయాగం అని పిలుస్తారు.
విశేషఫలం పూర్వం రాజ్యం సుభిక్షంగా ఉండాలనీ, ప్రజలంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలనీ, ఆపదలు తొలగిపోవాలనీ, శత్రువులపై విజయం సాధించాలనీ.... చండీయాగం చేసేవారు. రాచరికాలు పోయినా, చండీయాగం పట్ల నమ్మకం మాత్రం ఇంకా స్థిరంగానే ఉంది. అందుకే ఇప్పటికీ స్తోమత ఉన్నవారు, రాజకీయ నాయకులు ఈ యాగాన్ని తలపెడుతూ ఉంటారు.


Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends

నోముల మాసం


నోముల మాసం

సకల దేవతలకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర శ్రావణ మాసం రానేవచ్చింది. అన్ని మాసాలలోనూ ఎంతో శుభప్రదమైనదని పురాణాలు చెపుతున్న ఈ మాసంలో శుభకార్యాలు, నోములు, వ్రతాలు..అన్నీ అధికంగా పలకరిస్తాయి. ఈ మాసం వచ్చిదంటే మహిళల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. అంతటా ఒకటే సందడి..హడావుడి నెలకొని ఉంటుంది. పెళ్లి పనులతో కొందరు.. కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలకు శ్రావణ పట్టీలు పెట్టే వేడుకలతో మరికొందరు తలమునకలుగా ఉంటారు. కుటుంబ సుఖసౌఖ్యాల కోసం చేసే నోములతో, వ్రతాలతో ఈ నెలంగా ఇట్టే గడచిపోతుంది. అమావాస్యతో ఆషాడానికి వీడ్కోలు పలుకుతూ పండుగల మాసం సోమవారం నుంచి ప్రారంభం కానుంది.

సందడిగా సాగే ప్రధాన పండుగలన్నీ శ్రావణంలోనే కనపడతాయి. *ఆగస్టు 4న వరలక్ష్మీ వ్రతం*,
7న రాఖీ పౌర్ణిమ*... సనాతన ధర్మాన్ని చాటుతుంటాయి. అందరూ సమానమన్నట్టు *బలరామకృష్ణు్ణల జయంతి, హయగ్రీవ జయంతి-* వంటివి భక్తిభావాలను మరింత పెంచుతాయి.

15న రానున్న శ్రీకృష్ణభగవానుని జన్మాష్టమి* పర్వదినం శ్రావణ మాసానికే తలమానికంగా నిలుస్తుంది. శ్రావణ బహుళ విధియనాడు శ్రీ మంత్రాలయ రాఘవేంద్రుల ఆరా«ధనా ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతాయి. అలాగే *మంగళగౌరి వ్రతం, నాగపంచమి*, సామాన్య భక్తులే గాక రైతులు కూడా పంటలు సమృద్ధిగా పండాలని, ప«శు సంపద వర్దిల్లాలని ప్రత్యేకంగా పూజలు చేసే *పొలాల అమావాస్య-* కూడా ఇదే మాసంలో రావడం విశేషం.

మహా శివునికీ ప్రీతికరమే.

అన్నిటికి మించి పరమశివునికి కార్తీకం తర్వాత ఇష్టమైనది శ్రావణమాసమేనని శివపురాణం చెబుతోంది. ఈ మాసంలో చేసే *శనిత్రయోదశి పూజలు, తైలాభిషేకాలు, మహారుద్రాభిషేకాలు* పరమపద మోక్ష ప్రాప్తి కల్గిస్తాయని పురాణపండితులు చెబుతున్నారు.
అదే విధంగా ఉపవాస దీక్షలకు ఇందులో అధిక ప్రాధాన్యముంటుంది. ముఖ్యంగా మహిళలు సుమంగళిగా జీవించాలని ఐదవతనం కోసం చేసే వివిధ నోములు, వ్రతాలతో ఆలయాలే కాదు ఇంటి పరిసరాలు పచ్చటి తోరణాలతో పసుపు కుంకుమలతో కళకళలాడుతాయి.

శ్రావణ పూజలు అత్యంత శుభప్రదం*
శ్రావణం సమస్త హైందవ జాతిని ఏకం చేసే మహత్తర సాధనంగా చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. సర్వపాపల హరణకు, సకల శుభ యోగాలకు శ్రావణ మాస పూజలు శ్రేష్టమైనవి. పవిత్ర శ్రావణంలో వచ్చే ప్రతి దినమూ మంగళకరమే.
Please Leave your Comment below / Ask doubts ? / Suggestions Details;-
Share this to your Friends
.